ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు అండగా సంక్షేమ పథకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 06:33 PM

పేదలకు అండగా అన్ని సంక్షేమ పథకాలు రూపొందించి, వారికి అనేక పథకాలతో ఆర్థిక సహాయం అందించి వారి స్థితిని మెరుగుపరిచి నిజమైన స్వతంత్రం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కింది అని యంవిఆర్ అన్నారు. శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నందవరం మండలం ముగతి సచివాలయం నందు జాతీయ జెండా ను కెడిసిసి డైరెక్టర్, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు ముగతి విరుపాక్షిరెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరి అభివృద్ధి జగనన్న భాద్యత గా తీసుకొని దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా, రూపాయి లంచం లేకుండా నేరుగా వారి ఖాతాలో జమ చేస్తూ సంక్షేమం అంటే దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే లా చేసారు అన్ని అన్నారు. నిజమైన స్వతంత్రం అంటే పేదల కోనుగోలు శక్తి పెరగాలని అందుకే పేదలందరికి సంక్షేమ పథకాలతో నగదు జమచేస్తున్నారు అన్ని అన్నారు.పేదరికం నిర్మూలనకు జగనన్న కృషి విశేషం అన్ని కొనియాడారు. పేదల ఆర్ధిక ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలతో ఆర్ధిక సహాయం, ఆరోగ్యానికి అండగా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు విద్యా కానుక, గోరు ముద్దు, విద్యా,వసతి దివెన్న,డ్రైవర్లుకు వాహన మిత్ర, మహిళలకు ఆసరా, చేయూత, అమ్మవాడి, టైలర్,రజకులు, నాయబ్రాహ్మనలకు చేయుత పథకం ఇలా అని వర్గాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేప్పడుతు వారికి అండగా నిలిచారు అని తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అధ్వర్యంలో వారి సహకారం తో అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో మోడల్ స్కూల్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, జెడ్పీ పాఠశాల చైర్మన్ ప్రకాశం, అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com