బేతంచర్ల మండలంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ కార్యాలయాలలో జాతీయ పథకాన్ని ఎగురవేసి జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ విద్యాసాగర్, పోలీస్ స్టేషన్ సిఐ కేశవరెడ్డి, ఎంపీడీవో ఆఫీసు నందు ఎంపీడీవో అశ్వనీ కుమార్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల ఉన్నతాధికారులు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం రావడానికి పోరాడిన వారి త్యాగాలను కొనియాడుతూ, ప్రతి ఒక్కరు దేశం కోసం వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అలాగే శేషారెడ్డి ప్రభుత్వ వైద్యశాల యందు డాక్టర్ నాగరాణి, నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ రమేష్ బాబు జాతీయ పథకాన్ని ఎగరవేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మధు, ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.