జోరుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు జోరుగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఓ లారీ వాగులో కొట్టుకుపోయింది. బస్వాపూర్ బ్రిడ్జిపై వాగు ఐదారు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. అయినా లారీ డ్రైవర్ శంకర్ అలాగే ముందుకెళ్లాడు. దీంతో ఆ ఉద్ధృతి దాటికి ఇసుక లారీ వాగులో కొట్టుకుపోయింది. క్లీనర్ ఎలాగోలా ఒడ్డుకు చేరాడు. లారీ డ్రైవర్ మాత్రం ఓ చెట్టును పట్టుకొని అలాగే ఉండిపోయాడు. కాపాడమంటూ ఆర్తనాదాలు చేశాడు.అప్పటికే ఒడ్డుకు చేరుకున్న లారీ క్లీనర్ స్థానికులకు సమాచారం అందించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గత ఈతగాళ్లు చేరుకొని లారీ డ్రైవర్ను కాపాడే ప్రయత్నం చేశారు. తాడు సాయంతో ఒడ్డుకు తీసుకొస్తున్న సమయంలో.. శంకర్ తాడును వదలిపెట్టడంతో. అతను వరదకు కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. మంత్రి హరీష్ రావు చొరవతో హెలికాప్టర్ కూడా తీసుకొచ్చారు. బాధితుడి కోసం బస్వాపూర్ వాగు చుట్టుపక్కల ప్రాంతాల్లో హెలికాప్టర్తో గాలిస్తున్నారు.