ప్రముఖ యాంకర్, నటుడు, కమెడియన్ బిత్తిరి సత్తి కరోనావైరస్ బారిన పడినట్లు ఫిలీం బైట్ కథనం ఆధారంగా తెలుస్తోంది. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడిస్తూ తన ఆరోగ్య పరిస్థితిని తెలిపారు. బిత్తిరి సత్తి చెప్పిన విషయాల ప్రకారం.. గత కొద్దిరోజులుగా జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్నాను. ఎందుకైనా మంచిదనే విషయంతో కరోనా పరీక్షలు చేయించుకొన్నాను. కరోనా టెస్టుల ప్రకారం కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నాను. నాకు కరోనా విషయమని తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. అయితే కరోనా వ్యాధికి భయపడకూడదని వారికి ధైర్యం చెప్పాను అని బిత్తిరి సత్తి తెలిపారు.ఇక కరోనా సోకిన విషయంతో మా టెలివిజన్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటీవల మా టెలివిజన్లో జరిగిన ఓ ఫంక్షన్కు బిత్తిరి సత్తి హాజరయ్యారు. ఆయనతోపాటు ప్రదీప్ లాంటి యాంకర్లు, ఇతర సినీ, టెలివిజన్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వేడుకకు హాజరైన వారంతా కరోనా భయాలతో ఉన్నట్టు సమాచారం.