ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిగొచ్చిన వెండి.. షాకిచ్చిన బంగారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 06:15 PM

నిన్న పైకెగసిన బంగారం ధరలు ఈరోజూ సైతం అదే ఒరవడి కొనసాగించాయి. హైదరాబాద్ లో బంగారం ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 15) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు భారీ పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60 పెరిగింది. దీంతో ధర 51,110 రూపాయలకు చేరింది.అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 260 రూపాయలు పెరిగింది. దీంతో 55,760 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలు మాత్రం అతి స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి. ఈరోజు రూ. 50 తగ్గింది. దీంతో కేజీ ధర రూ. 67వేల నుంచి కొద్దిగా ధర తగ్గడంతో రూ. 66,950కు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com