ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపిన కేశినేని నాని...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 15, 2020, 04:26 PM

విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయనకు లేఖను అందజేశారు. దీనిపై నాని ట్వీట్ చేశారు. విజయవాడ పౌరుల చిరకాల స్వప్నం అయిన కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తయిన సందర్భంగా గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. అంతేగాకుండా, విజయవాడ వచ్చి ఫ్లైఓవర్ ను ఆయన అమృతహస్తాలతో ప్రారంభించవలసిందిగా కోరినట్టు తెలిపారు. మీరు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మీరు ప్రారంభిస్తేనే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నగరానికి కనకదుర్గ ఫ్లైఓవర్ అందమైన మణిహారం వంటిదని అభివర్ణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com