కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో పాఠశాలలు తెరిచిన అమెరికా అందకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది. జూలై చివరి రెండు వారాల్లో దాదాపు 97,000 మందికి పైగా పిల్లలకు కరోనా సోకింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ నివేదికల ప్రకారం....పాఠశాలలను తిరిగి ప్రారంభించిన తరువాత దాదాపు 97,000 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ సమయంలో భారత్ లోనూ పాఠశాలలను తెరవాలని కొన్ని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం చేస్తుండడంతో తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.