బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన దాతృత్వానికి పరిమితులు లేవని చాటుకుంటూనే ఉన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఫిలిప్పీన్స్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సోనూ సూద్ మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది.ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. "మీరందరూ మీ కుటుంబాలను కలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నా. మీ కోసమే మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14 సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చేందుకు ఆగలేకపోతున్నాం" అంటూ వ్యాఖ్యానించారు.