ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో విమానం ఏర్పాటు చేసిన సోనూ సూద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 07:22 PM

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన దాతృత్వానికి పరిమితులు లేవని చాటుకుంటూనే ఉన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఫిలిప్పీన్స్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సోనూ సూద్ మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది.ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. "మీరందరూ మీ కుటుంబాలను కలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నా. మీ కోసమే మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14 సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చేందుకు ఆగలేకపోతున్నాం" అంటూ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com