ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చదువుకోవడానికి లోన్..పొందండిలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 07:18 PM

ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పేరుతో ఓ వెబ్‌సైట్ ప్రారంభించింది. www.vidyalakshmi.co.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనెరా బ్యాంకు లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో లోన్స్ ఇస్తాయి. 36 బ్యాంకుల నుంచి 110 లోన్ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఉన్నత విద్య అవసరాలకు తగ్గట్టుగా ఇందులోంచి లోన్ స్కీమ్ ఎంచుకోవచ్చు. విద్యార్థులు ముందుగా www.vidyalakshmi.co.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోనే Apply Now ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.అందులో మీ పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేయాలి. ఆ తర్వాత లోన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ముందుగా కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. మీ ఇన్‌కమ్ ప్రూఫ్స్, ఐడీ ప్రూఫ్స్, సర్టిఫికెట్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకులో ఎడ్యుకేషన్ స్కీమ్ సెలెక్ట్ చేసి దరఖాస్తు చేసేందుకు ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. లోన్‌కు దరఖాస్తు చేసే ముందు నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవడం తప్పనిసరి. లేకపోతే సరిగ్గా దరఖాస్తు చేయకపోవడమో, అప్లికేషన్ రిజెక్ట్ కావడమో జరగొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com