ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి వాయిదా పడిన ఇళ్ల పట్టాలు పంపిణి కార్యక్రమం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 06:42 PM

అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ఏపీ సర్కారు నిర్ణయం అమలు మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి ఉగాది రోజున ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి తొలుత ముహూర్తం నిర్ణయించారు. ఆ తర్వాత పలు కారణాలతో ఆ నిర్ణయం అంబేద్కర్ జయంతికి వాయిదా పడింది. అక్కడ్నించి జూలై 8 వైఎస్ జయంతి నాటికి ముహూర్తం మారింది. ఆ తర్వాత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలనుకున్నా అది కూడా వీలుకాని పరిస్థితి ఏర్పడింది.


ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోతోంది. అందుకే, అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని అనుకుంటోంది. ఇళ్ల స్థలాల సేకరణలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్న పిటిషన్లపై హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్లపై తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని సర్కారు ఆశిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com