ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు జనాల్ని భయపెడుతున్నాయి. కరోనా భయంతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగి భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. టిఒఐ కథనం మేరకు..మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రాధాకృష్ణా రెడ్డి మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి స్థానింకగా కరోనా పరీక్షలు నిర్వహించారు. అతడికి పాజిటివ్గా నిర్ధారణ కావటంతో కుటుంబసభ్యులు ఒంగోలు జీజీహెచ్కు తరలించారు.. అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. జీజీహెచ్లోని మేల్ రెసిడెన్సీ క్వార్టర్స్ నుండి ఎక్స్ రే కోసం తీసుకు వెళ్తుండగా.. ఆస్పత్రి మూడవ అంతస్థుపై నుండి దూకి బట్టగిరి రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మానసిక స్థితి సరిగా లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఆస్పత్రి సిబ్బంది షాకయ్యారు.