ఎస్వీబీసీ నిర్వహణకు ఏడాదికి రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతోందని టీటీడీ ఈవో చెప్పారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ట్రస్టుకు మూడు వారాల వ్యవధిలోనే రూ.2.61 కోట్ల విరాళాలు అందాయన్న ఆయన ట్రస్టుకు వచ్చే ఆదరణను బట్టి టిటిడిపై అదనపు భారం పడకుండా ఎస్వీబీసీ హెచ్డి ఛానల్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు వివరించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తామన్నారు. త్వరలో తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడ పురాణం పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్న ఆయన. ఎస్వీబీసీలో శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం కారణంగా అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించలేకపోయామని వివరించారు. ఆ తరువాత న్యూస్ బులెటిన్లో ప్రముఖంగా ప్రసారం చేశాం. ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవు” అంటూ వివరించారు. ఎస్పీ బీసీ చానెల్ ను యాడ్ ఫ్రీ చానల్ గా మారుస్తామని సింఘాల్ తెలిపారు.