సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీకై ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. ఒకరికి ఏమైందో తెలుసుకోవడానికి మరొకరు వెళ్లి... ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషాద సంఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. దేవగఢ్లోని దేవీపూర్లో ఈ రోజు ఉదయం సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలు వెళ్లారు. వీరు ఎంతకీ తిరిగిరాకపోయేసరికి ఇంటి యజమాని, ఇద్దరు కుమారులు ట్యాంక్లోకి ప్రవేశించారు. వీరు సైతం తిరిగిరాకపోయేసరికి సదరు యజమాని పొరుగింటి ఇద్దరిని పిలిచాడు. వీరుకూడా సెప్టిక్ట్యాంక్లోకి వెళ్లారు. ఇలా ఒకరితర్వాత మరొకరు వెళ్లి కన్నుమూశారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.