విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కరోనా కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో 50 మంది ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన 13 మందిలో అధికారులు 10 మందిని గుర్తించారు. వారికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
1. కొసరాజు సువర్ణలత (42), గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడబ్రోలు
2. డొక్కు శివబ్రహ్మయ్య (59) బెల్ కంపెనీ మేనేజర్, మచిలీపట్నం (మూడ్రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాక చేరారు)
3. పొట్లూరి పూర్ణచంద్రరరావు (80).. కొడాలి, ఘంటశాల కృష్ణా జిల్లా. గతంలో గుంటూరు సీపీఓగా పని చేశారు. రిటైర్ అయిన తర్వాత పీఏసీఎస్ అధ్యక్షుడిగా చేశారు. లంగ్ ఇన్ఫెక్షన్తో కోవిడ్ సెంటర్లో చేరారు
4. సుంకర బాబూరావు (80) రిటైర్డ్ ఎస్సై. ఇందిరానగర్, అజిత్సింగ్నగర్
5. మజ్జి గోపి (54) మచిలీపట్నం
6. జి.వెంకట జయలక్ష్మి (52) కందుకూరు, ప్రకాశం జిల్లా
7. వెంకట నర్సింహ పవన్ కుమార్, కందుకూరు, ప్రకాశం జిల్లా
8. సబ్బిలి రత్న అబ్రహం (48),
9.రాజకుమారి (భార్యభర్తలు), జగ్గయ్యపేట
10. మద్దాలి రఘు, మొగల్రాజపురం
చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపింది.