పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని 2018 డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద పేద రైతులకు సంవత్సరానికి రూ.6 వేల సాయాన్ని మూడు విడతలుగా రూ.2వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆరవ విడత సాయంలో భాగంగా నేడు 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలో రూ.17,100కోట్లను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. అర్హులైన రైతులకు నగదు జమ అయ్యిందో కాలేదో pmkisan.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత కుడి పక్క FORMERS CORNER అనే కాలం వస్తుంది. అందులో Beneficiary Status పై క్లిక్ చేసి రాష్ట్రం,జిల్లా,మండలం,ఊరు వివరాలు ఎంటర్ చేయాలి. అప్పుడు గ్రామంలో అర్హులైన రైతులందరి జాబితా వస్తుంది. అందులో చూసుకుంటే మీ ఖాతాలో రూ.2వేలు జమ అయ్యాయో లేవో తెలుసుకోవచ్చు.మీ ఖాతాలో డబ్బు జమ కాకపోతే మీ బ్యాంక్ అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. అక్కడ మీ పని జరగకపోతే మీరు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క హెల్ప్లైన్ నంబర్ను తీసుకోవచ్చు. మీరు PM-Kisan హెల్ప్లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ 1800115526 ను కూడా సంప్రదించవచ్చు. ఇది కాకుండా మీరు మంత్రిత్వ శాఖ యొక్క నంబర్ (011-23381092) ను కూడా సంప్రదించవచ్చు. మీ ఖాతాలో నగదు ఎందుకు జమ కాలేదో తెలుసుకోవచ్చు. అర్హులైన మీకు రాకపోతే జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా తిరిగి మీ నగదును పొందవచ్చు.