ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. ఏడాదిన్నర పాపపై వృద్ధుడి అఘాయిత్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 09, 2020, 03:08 PM

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు నగరంలో ఏడాదిన్నర బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై శనివారం దిశ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. టిఒఐ కథనం మేరకు..గుంటూరు నెహ్రూనగర్‌ శివారులోని మోతీలాల్‌నగర్‌లో భార్యభర్తలు నివాసముంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించే వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. శనివారం దంపతులు కూలి పనులకు వెళ్లగా బాలికలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. కాసేపటి తర్వాత పెద్ద కుమార్తె బయటికి వెళ్లగా ఇంటి పక్కనే ఉండే బి.రాము (55) ఇంట్లోకి ప్రవేశించి ఏడాదిన్న వయసున్న బాలికపై అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు.
చిన్నారి గట్టిగా ఏడవడంతో బాలిక అక్క ఇంట్లోకి వచ్చింది. కంగారుపడిన రాము ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పగడంతో వారు కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సలహాతో దిశ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దిశ స్టేషన్‌ డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సైలు హరిచందన, ఖాజీబాబులు ఘటనా స్థలికి వెళ్లి ప్రాథమిక విచారణ చేపట్టారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడికి కఠినశిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com