ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి ఈ ఏడాది కూడా పరీక్షల్లేవ్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 09, 2020, 09:46 AM

ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే విద్యాసంవత్సరం మూడు నెలలు ఆలస్యం కావడంతో సిలబస్ తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. దీనిపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. 30 శాతం నుంచి 40 శాతం మేర సిలబస్ తగ్గించే అవకాశం ఉందని సమాచారం. అయితే పరీక్షల విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు వచ్చే ఏడాది కూడా పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. వీరందరికి ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా పై తరగతులకు పంపిస్తామని స్పష్టం చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం తప్పనిసరిగా పరీక్షలు ఉంటాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com