భారత్ లో గత 24 గంటల్లో 61,537 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 88 వేల 611కి చేరింది. కరోనాతో కోలుకొని ఇప్పటి వరకు 14,27,005 మంది డిశ్చార్జు కాగా 42,518 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 6,19,088 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 933 మంది మరణించారు. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది.