ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కీమ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 07, 2020, 06:40 PM

శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఎ.ఐ.టి.యు.సి. వ్యాప్త జాతీయ సంఘాల పిలుపుమేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎ.ఐ.టి.యు.సి. కార్యదర్శి కే.నాగిరెడ్డి సీపీఐ కార్యదర్శి ఓబులయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్కీమ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా 40 సంవత్సరములుగా ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం స్కీమ్ కార్మికులకి ఈ.యస్.ఐ. పెన్షన్ భీమ, హెల్త్ కార్డులు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కరోనా కష్టకాలంలో ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం, పప్పు దినుసులు అలాగే కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఒక కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని అలాగే ఆటో కార్మికులకు ఈ.యస్.ఐ. ఈ.పి.యఫ్ అమలు చేయాలని బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే అత్యవసర సర్వీసులలో పనిచేస్తున్న వైద్య సహాయకులకు పీపీఈ కిట్లు అందించాలని శ్రీశైలం మండల తాసిల్దార్ రాజేంద్ర సింగ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎ.ఐ.టి.యు.సి. నాయకులు హనుమంతు, భవన నిర్మాణ రంగనాయకులు పులి రాజు, ఎస్కె బాబు, ఎ.ఐ.వై.యఫ్. నాయకులు బి.లక్ష్మయ్య, టి.యస్.కె. జాఫర్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు శివన్న, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com