నేడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ రామాంజనేయులు తెలిపారు.గురువారం స్థానిక సంత మార్కెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2004లో వైఎస్ఆర్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల గుండె జబ్బులు, వికలాంగుల కోసం మందకృష్ణ మాదిగ ఎంతో కృషి చేశారన్నారు.ఈ రోజులలో పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందుతూ ఉన్నారంటే ఆ గొప్పదనం కీర్తిశేషులు వైయస్సార్ రాజశేఖర్ రెడ్డిదేనని గుర్తు చేశారు. నేడు చేపట్టే ఆరోగ్యశ్రీ పథకం వార్షికోత్సవ కార్యక్రమాన్ని గ్రామ కమిటీ సభ్యులు చేపట్టి విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బాలరాజు, సహ కార్యదర్శి వసంతరాయుడు, సీనియర్ నాయకులు నెట్టేకలు, సుదర్శన్, పెద్దయ్యలు పాల్గొన్నారు.