దేశంలో ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లో ప్రవేశాల కోసం నిర్వహించే బిట్శాట్-2020 పరీక్ష తేదీలను బిట్స్ పిలానీ ప్రకటించింది.
బిట్శాట్ పరీక్ష విధానం:
ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ టెస్ట్ ద్వారా పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్లలో బీఈ/బీటెక్, బీఫార్మా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎవరు అర్హులు..?
ఇంటర్ ఎంపీసీ/బైపీసీలో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులు. ఇంటర్ స్టేట్ టాపర్లకు నేరుగా ప్రవేశం కల్పిస్తారు.
అందించే కోర్సులు:
బీఈ (సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఈఐ, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, బీఫార్మా కోర్సులతో పాటు ఎమ్మెస్సీ కోర్సులను కూడా బిట్స్ అందిస్తుంది.
పరీక్ష విధానం:
ఇది మూడు గంటల పరీక్ష. కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు, సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు జరుగుతాయి.
పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ www.bitsadmission.com/లో చూడొచ్చు.