నంద్యాల సమీపంలోని పొన్నాపురం కెసి కెనాల్ వద్ద ఇద్దరు వ్యక్తుల నుండి 80 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బ్యూరో (సెబ్) అధికారిని సిఐ లలితాదేవి తెలిపారు. నంద్యాల జగజ్జనని నగర్ కు చెందిన బోయ వన్నూరు, హరికృష్ణను అరెస్ట్ చేయడంతో పాటు వారిరువురూ కలిసి నాటుసారాను తరలిస్తున్న మోటార్ సైకిల్ ను కూడా సీజ్ చేసినట్లు సిఐ పేర్కొన్నారు. నాటుసారా మద్యం ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి సమాచారాన్ని తెలియజేస్తే దాడులు నిర్వహిస్తామని సిఐ లలితాదేవి తెలిపారు. సమాచారం అందజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.