రాష్ట్రంలో యస్సీ, యస్టీ, బిసి మైనార్టీ మహిళలకు రక్షణ కరువైందని యస్సీ, యస్టీ, బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. ఆదోనిలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని ఆమె విమర్శించారు. మహిళల పట్ల కనీసమైన గౌరవం చూపించటం లేదని, పేరుకు మాత్రమే దిశా మహిళా పోలీసు స్టేషన్ అని డియస్పిలు, సిఐలు అంతా మగవాళ్ళేనని మహిళా పోలీసు అధికారులు లేరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా స్టేషన్కు వెళ్ళినా మహిళల దశ మాత్రం మారడం లేదని ఆమె అన్నారు. పోలీసు స్టేషన్లలో పోలీసుల తీరుపై జిల్లా ఎస్పి స్పందింఛి మహిళల ఫిర్యాదులపై న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, ఆదోని దళిత మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి, ఆదోని డివిజన్ అధ్యక్షురాలు భారతమ్మ, మాల మహానాడు అధ్యక్షుడు నల్లన్న పాల్గొన్నారు.