ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుదఘాతంతో యువకుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 04, 2020, 11:22 AM

విద్యుదఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండలం రాకుంటపల్లిలో జరిగింది. ఉపాధి కోసం తిరుపతికి వెళ్లి అక్కడే స్థిరపడిన రాకుంటపల్లి వాసి రామకృష్ణ తల్లిని చూసేందుకు సొంత ఊరికి వచ్చారు. ఇంట్లో విద్యుత్ దీపం వెలుగని విషయాన్ని గుర్తించిన అయన మరమ్మతు చేసేందుకు ప్రయత్నం చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే రామకృష్ణ మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు తల్లికి సమాచారం ఇచ్చారు. తనను చూసేందుకు వచ్చిన కుమారుడు అనంత లోకాలకు చేరడాన్ని జీర్ణించుకోలేని తల్లి గుండెలు పగిలేలా రోదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com