ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద ఉద్ధృతి తగ్గుముఖం- కుదుటపడుతున్న అసోం

national |  Suryaa Desk  | Published : Tue, Aug 04, 2020, 11:08 AM

అసోంలో వరద ఉద్ధృతి తగ్గటం వల్ల పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు జిల్లాలు విముక్తం కాగా... 4.65 లక్షల మందికి ఉపశమనం లభించింది.అయినప్పటికీ 17 జిల్లాల్లో 3.89 లక్షల మంది ప్రజలు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 494 గ్రామాలు, 32 వేల హెక్టార్ల భూమి జలదిగ్బంధంలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. డుబిడీ, నిమతిఘాట్​, తేజ్​పుర్​లో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దాని ఉపనదులు ధన్​సిరి, జియా భరాలి, కొపిలి కూడా ఉద్ధృతిని మించి ప్రవహిస్తున్నాయి. మణిక్​పుర్​లో శనివారం వరద నీటిలో పడి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది అసోం ప్రభుత్వం. వీటిల్లో 7,181 మంది ఆశ్రయం పొందుతున్నారు. చిరాంగ్, బార్​పేట, కోక్రాఝర్​ జిల్లాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో అసోం అతలాకుతలమైంది. వరదలు, కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా 136 మంది మరణించారు. వరదల్లో 110 మంది మృత్యువాత పడగా.. కొండచరియల ప్రమాదాల్లో 26 మంది ప్రాణాలు విడిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com