కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో కొత్త జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. ఇందులో ప్రధానంగా ఇక నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ను కూడా అందించాలని విద్యా విధానంలో పేర్కొంది. ఉదయాన్నే బలమైన అల్పాహారాన్ని పిల్లలకు అందించడం వల్ల వారి మేధోశక్తిని పెంపొందించవచ్చన్నారు.
దీంతో అల్పాహారం కోసం నిబంధనలను చేర్చడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని సిఫార్సు చేశారు. వేడివేడి ఆహారం అందించలేని ప్రాంతాల్లో.. బెల్లంతో పాటు ఉడికించిన వేరు శెనగ, చెన్నా లేదా పండ్లను అందించవచ్చునని సూచించారు. ఇక స్కూల్ విద్యార్ధులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని.. సంపూర్ణ టీకా విధానాన్ని కూడా పాటించాలని కేంద్రం తెలిపింది. ప్రతీ విద్యార్థికీ హెల్త్ కార్డులను జారీ చేసి.. ఎప్పటికప్పుడూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుండాలని సూచించారు..