ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతికుండగానే స్మశానంలో వదిలేసిన కుటుంబీకులు...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 03, 2020, 10:23 AM

ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరులో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది. బతికున్న వ్యక్తిని కుటుంబ సభ్యులే స్మశాన వాటికలో వదిలేశారు. టిఒఐ కథనం మేరకు..జిల్లాలోని కందుకూరులో వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గుండెకు నిమ్ము చేరడంతో పాటు పక్షవాతం రావడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అయితే రెండు రోజులకు మించి బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న భర్తను ప్రైవేటు అంబులెన్స్‌లో తిరిగి తీసుకొచ్చి స్మశాన వాటికలో సజీవంగా భార్య, కొడుకులు వదిలేశారు. సొంత ఇల్లు లేకపోవడంతో ఆ కుటుబం కందుకూరులో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలిన తరుణంలో ఇంటి యజమాని తమను రానివ్వడనే భయంతో బాధితుడిని స్మశాన వాటికకు తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్స్ లేవంటూ అడ్మిషన్ ఇవ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరోనా పరీక్ష నిర్వహించినా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని, ఒంగోలు రిమ్స్‌లో వైద్యం చేయలేదని చెప్పారు. డాక్టర్లు 2 గంటలకు మించి బతకడని చెప్పి, పంపించి వేశారని సొంత ఇళ్లు లేకపోవడం వల్లే స్మశానానికి తీసుకొచ్చిన్నట్లు తెలిపారు. బతికున్న వ్యక్తిని స్మశానంలో వదిలేయడంపై కందుకూరులో కలకలం రేగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com