ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 02, 2020, 06:53 PM

విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ప్రమాద స్థలిని పరిశీలించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తామన్నారు. షిప్ యార్డు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com