రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తున్న సొమ్ములోంచి కొంత మొత్తాన్ని ఓ తల్లి కొన్నేళ్లుగా దాచిపెడుతోంది. ప్లాస్టిక్ కవర్లో మూటగట్టి ఇంటి వెనక గోతి తీసి పాతిపెట్టింది. బధిరురాలైన తమ కుమార్తె పెళ్లి కోసం ఆ డబ్బును భద్రంగా దాచిపెట్టింది. ఇటీవల ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. కూలీలు తవ్వుతుండగా ఆ ప్లాస్టిక్ మూట బయటపడింది. ఆ కవర్లో ఉన్న డబ్బంతా తాను కూడబెట్టిందేనని మహిళ చెప్పింది. ఆ డబ్బునంతా తమ ఖాతాలో డిపాజిట్ చేద్దామని దంపతులిద్దరూ బ్యాంక్కు వెళ్లారు. అక్కడ అధికారులు చెప్పిన మాటలు విని షాక్కు గురయ్యారు. అవన్నీ నాలుగేళ్ల కిందట రద్దైన రూ.1000, రూ.500 నోట్లే. వాటి మొత్తం విలువ రూ.35,500. ఆ నోట్లు ఇప్పుడు చెల్లవని అధికారులు చెప్పడంతో వాళ్లు లబోదిబోమంటున్నారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.