భారత్ లో నిషేధంతో టిక్ టాక్ యాప్ కు భారీ దెబ్బ తగిలి తీవ్ర నష్టాలు చవిచూసింది. తాజాగా అమెరికా సైతం టిక్ టాక్ ను నిషేధించడానికి పావులు కదుపుతుండడంతో టిక్ టాక్ అప్రమత్తమైంది. తమది చైనా యాప్ అయినప్పటికీ.. ఎప్పుడూ పక్షపాతంగా వ్యవహరించలేదని ప్రకటించుకుంటోంది. ఇతర దేశస్థుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేయలేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా కూడా తమను నిషేధిస్తే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో కొత్త పల్లవిని అందుకుంది టిక్ టాక్.తాజాగా టిక్టాక్ మాతృ సంస్థ బైట్డ్యాన్స్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. అందులో ప్రధానంగా బీజింగ్ నుంచి తమ ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కొత్త కార్యనిర్వాహక బోర్డును సైతం ఏర్పాటు చేసే యోచనలో బైట్డ్యాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా తమపై ఉన్న చైనా ముద్రను తొలగించుకోవాలన్నది బైట్డ్యాన్స్ వ్యూహం. టిక్టాక్, హెలో యాప్లు రెండింటికి బైట్డ్యాన్స్ మాతృ సంస్థ. ఈ రెండు యాప్లు నడవాలంటే చైనాకు దూరం దూరంగా ఉండాల్సిందేనని బైట్డ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం.