పాము కాటుకు భారత దేశంలో గడిచిన 20 ఏళ్లలో 1.2 మిలియన్ల మంది చనిపోయారు. ఇటీవల జరిగిన ఒక కొత్త అధ్యయనంలో ఈ భయపడే విషయాలు బయటకు వచ్చాయి. బాధితుల్లో దాదాపు సగం మంది 30 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సువారు ఉండగా, నాలుగింట ఒక వంతు పిల్లలు ఉన్నారని అధ్యయనంలో తేలింది. అయితే రస్సెల్ వైపర్స్, క్రైట్స్, కోబ్రాస్ జాతులకు చెందిన పాములతోనే చాలామంది చనిపోయారు.12 ఇతర జాతుల పాముల వల్ల మిగిలిన మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనలు చాలా వరకు వైద్యం అందని మారుమూల ప్రాంతాల్లోనే జరిగాయి. సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. అందులో భాగంగా జూన్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో పాముకాటుతో అధిక శాతం మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 81 వేల నుంచి 1,38,000 మంది పాము కాటుతో మరణిస్తున్నారని అధ్యాయనంలో తేలింది.