హెచ్ ఐ వీ అనేది ఒక వైరస్. ఇది శరీరంలో ఇన్ ఫెక్షన్స్ తో పోరాడే సెల్స్ ని ఎటాక్ చెస్తుంది. అందువలన ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి రకరకాలా వ్యాధులు సోకే అవకాశముంది. ఈ వైరస్ సురక్షితం కాని సెక్స్ ద్వారా, ఇన్ జెక్షన్స్ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. టాటూ ఎక్విప్మెంట్ వల్ల, ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకీ కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. హెచ్ ఐవీ స్పర్శ ద్వారా, దోమలు లాంటి కీటకాల ద్వారా, వస్తువులు షేర్ చేసుకోడం ద్వారా వ్యాపించదు. ఈ వైరస్ కి ట్రీట్మెంట్ గనుక తీసుకోకపోతే అది ఎయిడ్స్ వ్యాధిని కలుగచేస్తుంది. ఇప్పటి వరకూ హెచ్ఐవీకి మందు లేదు. అయితే, యాంటీ రిట్రోవైరల్ థెరపీ ద్వారా ఈ వైరస్ బారిన పడినవారు చాలాకాలం ఆరోగ్యంగా జీవించగలరు. ఎయిడ్స్ వ్యాధికి మందును కనుగొనే విషయంలో ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి.ఏన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న ఈ భయంకర వ్యాధికి శాస్త్రవేత్తలు మందు రెడీ చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. బ్రెజిల్ లోని సోవ్పాలో ఫెడరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనాలు ఎయిడ్స్ ఔషదాల విషయాలపై కొన్ని విషయాలను వెల్లడించారు. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. ఓ బ్రెజిల్ వ్యక్తికి యాంటి వైరల్ డ్రగ్ రెజిమెన్ ఇచ్చారు. 48 వారాల పాటు డొల్యూటిగ్రవిర్, మారవిరోక్, 500 ఎంజీ నికోటినమైడ్ డ్రగ్స్ ఇచ్చారు. చికిత్స లేకుండానే ఈ ఔషధం ఇవ్వడం వల్ల ప్రస్తుతం అతడు కోలుకున్నాడు. దీంతో ఈ మందును మరికొందరి మీద ప్రయోగించిన తర్వాత ఆ ఫలితాల ఆధారంగా పూర్తి అధ్యయనాన్ని తెలుపుతామని శాస్త్రవేత్తలు తెలిపారు.మరో ప్రయోగంలో ఇంజెక్షన్ ద్వారా హెచ్ఐవీని తరిమికొట్టేదాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రతి 8 వారాలకు ఒకసారి కాబొటిగ్రవిర్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచంలో సుమారు 3.7 కోట్ల మంది హెచ్ఐవీ లేదా ఎయిడ్స్తో బాధ పడుతున్నారు. 2019లో 690,000 మంది ఎయిడ్స్తో మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఎయిడ్స్తో మరణించే వారి సంఖ్య 2010తో పోల్చితే 2019లో 30శాతం వరకు తగ్గింది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనుగొన్న ఎయిడ్స్ వ్యాధి మందు విజయవంతం అయితే అనేక మందికి ప్రాణాపాయం తప్పుతుంది. 2020లో కరోనా మరణాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎయిడ్స్ వ్యాధి మందు కనుగొనడం కొంత ఊరటనిచ్చే అంశమే అని చెప్పాలి.