ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో విద్యార్ధుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఇంటర్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మెయిన్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన విద్యార్ధులందరూ కంపార్ట్మెంటల్లో పాస్ అయినట్లు పేర్కొంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ వి.రామకృష్ణ వెల్లడించారు. ఫెయిల్ అయిన విద్యార్ధులందరికీ కూడా ప్రతీ సబ్జెక్ట్లోనూ పాస్ మార్కులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఫస్టియర్ పరీక్షల్లో మార్కులు ఇంప్రూవ్మెంట్ కోరుకున్న విద్యార్ధులకు 2021 మార్చిలో మరో ఛాన్స్ ఇస్తామన్నారు.