ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) తాజాగా పీఎఫ్ సబ్స్క్రైబర్లకు శుభవార్త అందించింది. పీఎఫ్ విత్డ్రాకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని తెలిపింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఈపీఎఫ్వో వీటికి కరోనా వైరస్ ఆప్షన్ కూడా జతచేసింది. కేవలం కోవిడ్ 19 ఆప్షన్ కింద పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకుంటేనే ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్వో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.