ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు తీపికబురు.. ఈ తేదీ నుంచే అకౌంట్లలోకి రూ.2,000!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 09, 2020, 08:25 PM

కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటి వరకు ఈ పథకంలో 10 కోట్లకు పైగా రైతులు చేరారు. పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారికి ప్రభుత్వం రూ.6,000 అందజేస్తుంది. ఈ డబ్బులు రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమవుతుంది. ఆగస్ట్ 1 నుంచి అన్నదాతలకు రూ.2,000 డబ్బులు అందనున్నాయి.పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరని వారు ఉంటే సులభంగానే ఇంట్లో నుంచే ఈ పథకంలో చేరొచ్చు. దీని కోసం మీ వద్ద మీ పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారం ఉంటే సరిపోతుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరే పథకంలో చేరొచ్చు.కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే రూ.లక్ష కోట్లతో రైతుల కోసం అగ్రిక్చర్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లను గ్రామాలకు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంది.అగ్రి ఫండ్‌లో భాగంగానే శీతల గిడ్డంగులు, వేర్‌హౌస్‌లు, ఇమార్కెటింగ్ పాయింట్లు, ఇట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ వంటి వాటిని నిర్మిస్తారు. అంతేకాకుండా ప్రైమరీ అగ్రి క్రెడిట్ సొసైటీ, ఫార్మర్స్ గ్రూప్, అగ్రి ఎంట్రప్రెన్యూర్స్, స్టార్టప్స్, అగ్రి టెక్ సంస్థలకు నిధులు అందజేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com