ఆ మహిళకు 29 సంవత్సరాలు. పది సంవత్సరాల క్రితం పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చక్కగా సాగుతున్న జీవితం. కానీ ఓ మిస్ కాల్ ఆమె జీవితాన్నే అంధకారంలోకి నెట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.తమిళనాడులోని నెల్ లై జిల్లా సేరన్ మహాదేవి ప్రాంతానికి చెందిన వ్యక్తితో పాళయంకోటై కృష్ణపురానికి చెందిన మహిళతో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 8 సంవత్సరాల బాలుడు, 4 సంవత్సరాల కూతురు ఉంది. సదరు మహిళకు సంవత్సరం క్రితం కాయత్తార్ కి చెందిన యువకుడి నుంచి పొరపాటుగా మిస్ కాల్ వచ్చింది. అలా వీరిద్దరి మధ్య మాటలు కలిసి ప్రేమగా మారింది. సదరు మహిళ తనకు పెళ్లి కాలేదని యువకుడిని నమ్మించింది.మహిళ అప్పుడప్పుడు అతనిని కలిసేది. ఆ సమయంలో తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసేసేది. ఆమెను ప్రేమించిన యువకుని వయస్సు 24 సంవత్సరాలు. ప్రేమ మత్తులో మునిగిన మహిళ తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచింది. ఆ యువకున్ని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడింది. దీంతో యువకుడు తమ ప్రేమ వివాహన్ని ఇంట్లో చెప్పడంతో యువకుని కుటుంబ సభ్యులు కాదనలేకపోయారు.జూన్ 20న నాగర్ కోవిల్ లో తనకు ఇంటర్వ్యూ ఉందని భర్తకు చెప్పిన మహిళ యువకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత జూన్ 24వ తేదీన తెన్ కాశీ సమీపంలోని సుందరపాండియన్ పురంలో ప్రియున్ని అతని బంధువుల సమక్షంలో వివాహం చేసుకుంది. జూన్ 20 నుంచి భార్య ఆచూకీ లేకపోవడంతో మహిళ భర్త సేరన్ మహాదేవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సదరు మహిళ తాను పెళ్లి చేసుకున్న ఫోటోలను స్టేటస్ గా పెట్టుకుంది. దీనిని చూసిన భర్త షాకయ్యాడు. ఆ ఫోటోలను పోలీసులకు చూయించాడు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు మహిళ ఆచూకీ కనుకున్నారు. ప్రియునితో ప్రేమ,పెళ్లి విషయం తెలిసింది. సదరు మహిళకు పెళ్లై పిల్లలున్నారని తెలిసి ప్రియుడు,వారి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఈ విషయం తెలిసి ప్రియుడు ఆమెను వదిలి పెట్టేందుకు సిద్దమయ్యాడు. భర్త ఆమెను తన భార్యగా అంగీకరించేది లేదన్నాడు. దీంతో పోలీసులు ఆమెను సేరన్ మహాదేవిలో ఉన్న కరోనా శిబిరంలో ఓ రోజు ఉంచారు. ప్రియుని కుటుంబంతో మరియు భర్త కుటుంబంతో పోలీసులు చర్చలు జరిపారు. కానీ ఎవరూ కూడా ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు అంగీకరించలేదు.ఇప్పుడు ఆమె విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక పోలీసులు, అధికారులు సందిగ్దంలో పడ్డారు. ఆమెను మహిళా సదన్ కు తరలించే అవకాశం ఉంది. సంతోషంగా సాగుతున్న జీవితంలో మిస్ కాల్ చిచ్చు పెట్టింది. ఆమె చేతులారా ఆమె జీవితాన్ని ఆగం చేసుకుందని పలువురు సదరు మహిళను విమర్శించారు.