ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆవు పై అఘాయిత్యం

national |  Suryaa Desk  | Published : Thu, Jul 09, 2020, 03:42 PM

ఓ వ్యక్తి ఏకంగా ఆవు పైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సుందర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. డైరీ ఫామ్ యజమాని కథనం మేరకు..ఓ 55 ఏళ్ల వ్యక్తి సుందర్ నగర్ లోని డైరీ ఫారం లోకి వచ్చాడు. అక్కడ ఉన్న ఆవుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆవు తీవ్ర అస్వస్ధతకు గురైంది. ఆ తర్వాతి రోజు డైరీ ఫారం యజమాని రామ్ యాద‌వ్ ఆవులను పరిశీలిస్తుండగా అస్వస్ధతగా ఉన్న ఆవును గమనించాడు. ఆవుకు ఎవ‌రైనా ఏమైనా చేశారా అన్న అనుమానంతో య‌జ‌మాని ఆలోచించాడు. డైరీ ఫామ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ప‌రిశీలించాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆవుపై అఘాయిత్యానికి పాల్ప‌డిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా రామ్ యాద‌వ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ష‌బ్బీర్ అలీని అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com