యూపీలో 8 మంది పోలీసులను చంపిన రౌడీ షీటర్ వికాస్ దూబే గ్యాంగ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని ఎన్ కౌంటర్ చేశారు. వికాస్ దూబే ఆచూకీ కోసం పోలీసులు టీంలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఎన్ కౌంటర్ విషయాన్ని యూపీ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.