కరోనా మహమ్మారి కారణంగా ఫేక్ న్యూస్ ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ‘పీఎం మాస్క్ యోజన’ కింద ఉచితంగా మాస్కులు అందజేస్తారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వార్త అబద్ధమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. అలాంటి పథకం లేదని, దానికి సంబంధించిన వెబ్ లింక్స్ కూడా ఫేక్ అని స్పష్టం చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ‘పీఎం మాస్క్ యోజన’ లాంటి ఎలాంటి స్కీమ్ నూ ప్రవేశపెట్టలేదని.. ఇలాంటి ఫేక్ న్యూస్, వెబ్ సైట్స్ తో జాగ్రత్తగా ఉండాలని ఓ ట్వీట్ లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.