వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత రోజే ప్రియురాలు సైతం ప్రాణాలు తీసుకుంది. వివరాల ప్రకారం.. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన సాహిల్ కుమార్(22) మొహాలిలోని సెక్టార్ 66లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.అతడికి ఇటీవల జార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన ప్రగ్యా(26)తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. కాలం గడుస్తున్నా కొద్ది ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో పెయింగ్ గెస్ట్గా ఉండేవారు. ఏమైందో ఏమో తెలియదు కానీ సాహిల్ కుమార్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రగ్యా సైతం ప్రాణాలుతీసుకుంది. కుమార్ ఆత్మహత్య సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. అయితే కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ప్రగ్యా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.