కేంద్రం ఆహార భద్రత కార్డులు ఉన్నవారికే బియ్యం ఇవ్వనుందని, పేదలకు కూడా బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 87 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 2.79 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలకు తోడు అదనంగా మరో 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. నవంబర్ వరకు ఒక్కొక్కరికీ 10 కిలోల చొప్పున బియ్యం ఇస్తామన్నారు. రేపటి నుంచి పేదలకు బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని గంగుల చెప్పారు.