ఏపీలో మళ్లీ కరోనా వైరస్ విజృంభించింది. గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 765 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 727 ఏపీలో ఉన్నవారు, 32 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, ఆరుగురు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో 17,699 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో ప్రస్తుతం 9473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8008 మంది డిశ్చార్జ్ అయ్యారు. 218 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 24, 962 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 996573 కరోనా టెస్టులు చేశారు.