సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఒకటవ బ్లాక్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఇప్పటికే వ్యవసాయ శాఖలో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్ అని తేలగా...అతని రూమ్మేట్గా ఉన్న సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగికి కరోనాగా నిర్ధారణ అయ్యింది. దీంతో సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తరహాలోనే వర్క్ ఫ్రం హోమ్ అమలుకు ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు. అసెంబ్లీ భద్రతా విధుల్లోని కానిస్టేబుల్కు కరోనా సోకడంతో అసెంబ్లీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ కేటాయించారు. రెండ్రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ విధుల నిర్వహణకు అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటి కే ఆదేశాలు జారీ చేశారు.