బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గ్యాంగ్ వార్లో ప్రధాన సూత్రధారి ట్రాక్టర్ డీలర్ సోనాలిక్ నాగబాబుగా పోలీసులు గుర్తించారు. పెనమలూరు నియోజవర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నాగబాబు చెప్తే జరగని పని అంటూ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అపార్ట్మెంట్ పంచాయతీకి ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డితో సిట్టింగ్కు నాగబాబు ముహూర్తం నిర్ణయించాడు. పేకాటలో పరిచయమైన సందీప్ని ఈ సెటిల్మెంట్కి ఉపయోగించుకోవాలని నాగబాబు నిర్ణయించుకున్నాడు. నాగబాబు సందీప్కి కామన్ ఫ్రెండ్కు చెందిన స్థలంలో ప్రదీప్, శ్రీధర్ల మధ్య నాగబాబు సిట్టింగ్ ఏర్పాటు చేశాడు. ప్రదీప్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న స్నేహితుడికి పండుతో పరిచయం ఉండడంతో అపార్ట్మెంట్స్ సెటిల్మెంట్ వ్యవహారాన్ని పండుకు ప్రదీప్ చెప్పాడు. సెటిల్మెంట్ జరుగుతున్న ప్రదేశానికి పండు నేరుగా వెళ్లగా.... కాసేపటికి సందీప్ అక్కడకు చేరుకున్నాడు. అక్కడ పండును చూసి సందీప్ ప్రశ్నించాడు. ఆపై ఇరువురి మధ్య మాటామాట పెరగడంతో సందీప్ కాలర్ను పండు పట్టుకోవడంతో అప్పటి నుంచి ఇరువురి మధ్య వివాదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
సందీప్ తన అనుచరుల్ని పండు ఇంటికి పంపడం... పండు తల్లికి ఆగ్రహం తెప్పించింది. దీంతో సందీప్ను చంపితేనే ఇంటికి రా అంటూ కొడుకుని రెచ్చగొట్టింది. అయితే పండు తరచూ గొడవలకు వెళ్తున్న నేపథ్యంలో ముందస్తుగా కొడుకుకు మతిస్థిమితం లేదంటూ డాక్టర్ నుంచి పండు తల్లి సర్టిఫికెట్ తీసుకున్నట్లు సమాచారం. పండుకు గంజాయి అమ్మే వారితో పరిచయాలు ఉండడంతో వారిని కూడా గ్యాంగ్ వార్లో పాల్గొనే విధంగా చేశాడు. వీరితో పాటు గ్యాంగ్ వార్లో వన్టౌన్, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన బ్యాచ్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరే కాకుండా పండు వెనక మరో ముగ్గురు రౌడీషటీర్లు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. గ్యాంగ్ వార్ జరిగే సమయంలో వారంతా పూర్తిగా గంజాయి సేవించి దాడులకు పాల్పనట్లు గుర్తించిన పోలీసులు ఈ గ్యాంగ్ ముఠాలో కీలక పాత్ర పోషించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.