ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సర్కార్ శుభవార్త..ఒక్కొక్కరికి రూ. 10 వేలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 10:32 AM

రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకంతో సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పనున్నారు. ఈ పథకంలో భాగంగా.. కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైనా. ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నారు.ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 37,756 వేల మందిదరఖాస్తు చేసుకున్నారు. క్రిందటి ఏడాది లబ్ది పొందిన 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రేపు ఆన్ లైన్ ద్వారా అకౌంట్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. మొత్తం 2,62,493 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్‌లో ఇవ్వాల్సిఉన్నా కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ పథకం కింద ఎంపికైన మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,590 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు.. 10,049 మంది ఎస్టీలు.. 28,118 మంది మైనార్టీలు.. 581 బ్రాహ్మణ, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com