ఏపీలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ విద్యాశాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షల అనంతరం ఆన్లైన్ పద్ధతిలో పారదర్శకంగా ఈ బదిలీలు నిర్వహించాలని అధికారులను సూచించారు. బదిలీలును విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూపు సురేష్ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు.నాడు-నేడు కార్యక్రమం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మొదట దశలో 500 కొత్తగా జునియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘జగనన్న గోరు ముద్ద’ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.