భూమి మీద ప్రాణులు బతకాలంటే నీరు అత్యవసరం. మానవ శరీరంలో కూడా డెబ్భై శాతం నీరే ఉంది. అందుకే నీరు మనకి ప్రాణాధారం. ఇకపోతే పూర్వకాలంలో మన పెద్దలు నీటిని రాగి పాత్రల్లో నిల్వ చేసేవారు. మనం ఇవాళ వాటర్ ప్యూరిఫైయర్ల తో నీటిని శుద్ధి చేసుకుంటున్నాం. కానీ, ఇదే పని రాగి పాత్ర కూడా చేస్తుంది. ఆయుర్వేదంలో చెప్పినదాని ప్రకారం ఈ విషయాన్ని ఇవాళ కొన్ని పరిశోధనలు కూడా ప్రూవ్ చేస్తున్నాయి. రాగి పాత్ర నీటిని సహజ పద్ధతుల్లో శుద్ధి చేస్తుంది. మన ఆరోగ్యానికి కావాల్సిన మినరల్స్లో రాగి ఒకటి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.కాపర్ ఎనీమియా రాకుండా చేస్తుంది. రాగి పాత్రలోని నీరు హానికరమైన బాక్టీరియాని చంపేసి అల్సర్స్నీ, ఇండైజెషన్ నీ, ఇన్ ఫెక్షన్స్ నీ తగ్గిస్తుంది. రాగి శరీరానికి ఆహారం ద్వారానే అందాలి. సీ ఫుడ్, ఆర్గన్ మీట్, హోల్ గ్రెయిన్స్, పప్పులు, గింజలు, చాక్లేట్, బంగాళా దుంపలు, బఠానీలు, ముదురురంగు ఆకుకూరల నుంచి మనకి రాగి లభిస్తుంది. రాగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా కాన్సర్ ముప్పు ని తగ్గిస్తుంది.మీ ముఖం మీద ముడతలు కనపడకూడదని మీరనుకుంటే మీకిది మంచి ఆప్షన్. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి అవ్వడంలో కాపర్ పాత్ర చాలా ఉంది. ఇందులో ఉన్న యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాల వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. అంతేకాదు, ఇది మన ఇమ్యూన్ సిస్టంని బాగా స్ట్రాంగ్ గా చేస్తుంది. థైరాయిడ్ డిసీజెస్ తో బాధ పడుతున్నవారందరిలో ఉండే ఒక సాధారణ సమస్య వారి శరీరంలో కాపర్ తక్కువ ఉండడమే అని నిపుణుల అభిప్రాయం. అందువల్లే, రాగి పాత్ లో నీరు థైరాయిడ్ సమస్య రాకుండా చేస్తుంది.