కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో అనుమానితులకు కరోనా టెస్ట్ లు చేసి వైరస్ ను నిర్దారించడంలో ఏపీ ముందంజలో ఉంది. కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రోజుకు 12 వేల మందికి పైగా పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 3200 మంది పాజిటివ్ రాగా, వారికి ఆరోగ్య సేవలు అందించి 2209 మందిని ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపినట్లు ఏపీ కరోనా నోడల్ ఆఫీసర్ వెల్లడించారు. కరోనా కేసుల్లో దేశ రికవరీ రేటు 48 శాతం, ప్రపంచంలో 45 శాతం ఉండగా ఏపీలో మాత్రం 69 శాతంగా ఉందని వివరించారు.