ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 44 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2671కి చేరింది. ఇప్పటి వరకు 1848 మంది డిశ్చార్జ్ కాగా,56 మంది మరణించారు. 767 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తుంది.