కరోనా ప్రభావంతో టీటీడీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి జూన్ 30 వరకు దర్శన టికెట్లు,శ్రీవారి ఆర్జిత సేవలు,వసతి సౌకర్యాలు బుక్ చేసుకున్న వారికి మనీ రీఫండ్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. మే 31 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో టీటీడీ అప్పటి వరకు భక్తులకు అనుమతి లేదు. జూన్ 1 నుంచి భక్తులకు అనుమతించాలా లేదా అనేది అప్పుడు నిర్ణయించనున్నారు. ఇప్పుడు బుకింగ్స్ రద్దైన భక్తులు బుకింగ్ వివరాలు,టికెట్ వివరాలు,బ్యాంక్ అకౌంట్ నంబర్,పేరు,IFSC కోడ్ వివరాలు ఎక్సెల్ టెక్స్ లో టైప్ చేసి refunddesk_1@tirumala.org అనే మెయిల్ ఐడీకి పంపాలని టీటీడి సూచించింది. మెయిల్ వచ్చే వివరాలు పరిశీలించి అవి నిజమైనవో కాదో పరిశీలించిన తర్వాతే రీఫండ్ చేయనున్నారు. ఎక్సెల్ ఫార్మాట్ తప్ప ఏ ఫార్మాట్ లో పంపినా ఆమోదించరు.